వరద నష్టపరిహారం పెంచాలని విజయవాడ ఆటో కార్మికుల డిమాండ్ | Vijayawada Auto Workers Are Demanding for Higher Flood Compensation

WhatsApp Group Join Now

విజయవాడ: వరదల కారణంగా ఆటోకార్మికులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం అందిస్తున్న ₹10,000 సహాయం సరిపోదని ఆటో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. లెనిన్ సెంటర్ లో ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డ్రైవర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Auto workers are urging an increase in flood compensation
Auto workers are urging an increase in flood compensation

ప్రభుత్వ సహాయం పట్ల అసంతృప్తి

“మా నష్టం చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రభుత్వం కేవలం ₹10,000 ఇస్తామని ప్రకటించడం అన్యాయం. ప్రతి ఆటోకూ కనీసం ₹25,000 ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుతున్నాం” అని కార్మికులు తెలిపారు.

ఇన్సూరెన్స్ సమస్యలు

ఇన్సూరెన్స్ కూడా సరిగా పనిచేయడం లేదని వారు వాపోయారు. ఒక నెల డబ్బులు కట్టకపోతే ఇన్సూరెన్స్ రద్దు చేస్తున్నారని, ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నా తక్కువ మొత్తాన్ని మాత్రమే ఇస్తున్నారని వారు ఆరోపించారు.

పెద్ద ఎత్తున ఆందోళన & హెచ్చరిక

ప్రభుత్వం తమ సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేకించి ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఆటోల రిపేరు పనులను వేగంగా పూర్తి చేయాలని, ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని కార్మికులు డిమాండ్ చేశారు.

వీడియో

Auto workers are demanding for higher flood compensation

Leave a Comment