ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) పెద్ద షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) పథకం నిధుల దుర్వినియోగం కేసులో ఈడీ రూ. 23.54 కోట్ల స్థిర, చర ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసు కింద మనీ లాండరింగ్ చట్టం (PMLA) 2002 ప్రకారం చర్యలు తీసుకున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ పథకం దుర్వినియోగం
APSSDC Siemens ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ ప్రాజెక్టు యువతకు నైపుణ్యాల అభివృద్ధి, పారిశ్రామిక రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని చేపట్టబడింది. కానీ, ఈ నిధులను డిజైన్టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (DTPSL) వంటి సంస్థలు మళ్లించాయి.
నిధుల మళ్లింపులో ప్రధాన వ్యక్తులు
ఈడీ చేసిన విచారణ ప్రకారం, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్, సౌమ్యాద్రి శేఖర్ బోస్, సుమన్ బోస్, వికాస్ వినాయక ఖన్వెల్కర్ వంటి వ్యక్తులు ఆ నిధులను తప్పుడు పద్ధతుల్లో మళ్లించినట్లు వెల్లడైంది. వీరు షెల్ కంపెనీలను ఉపయోగించి బోగస్ ఇన్వాయిస్లతో నిధులను మళ్లించారు. పలు లేయర్స్ లో ముడుపులు తీసుకుని నకిలీ సేవలు అందించినట్టు గుర్తించారు.
ఈడీ చర్యలు
ఈ కేసులో చరాస్థులుగా బ్యాంక్ ఖాతాలు, షేర్లు, అలాగే స్థిర ఆస్తులుగా ఢిల్లీ NCR, ముంబై, పూణే లో నివాస ఆస్తులు గుర్తించబడి, ఈడీ వాటిని జప్తు చేసింది. అంతకుముందు కూడా రూ. 31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
తదుపరి విచారణ
విచారణ ఇంకా కొనసాగుతోంది. కేసుకు సంబంధించి నిందితులపై ప్రత్యేక కోర్టులో అభియోగాలు నమోదు చేయబడ్డాయి. ఈ కేసులో నిందితులపై మరింత సమాచారం సేకరించడానికి చర్యలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి
మంగళగిరి TDP ఆఫీస్ పై దాడి కేసును CIDకి అప్పగింత
వీడియో
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో సిమెన్స్ కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై, పూణేలలోని రూ.23.54 కోట్ల చర, స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు… pic.twitter.com/QdoriI1MHE
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2024
4 thoughts on “చంద్రబాబుకు ఈడీ బిగ్ షాక్ | AP Skill Development Scam”