విశాఖ ముత్తూట్ ఫైనాన్స్ లో జరుగుతున్న మోసం | Vizag Muthoot Finance Scam Exposed

WhatsApp Group Join Now

విశాఖపట్నం ద్వారకానగర్‌లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌పై భారీ మోసం ఆరోపణలు వస్తున్నాయి. రుణం కోసం బంగారం తాకట్టు పెట్టిన కస్టమర్లు, బంగారం తిరిగి పొందడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బాధితుల వేదన

బాధితులు తమ బంగారం గురించి సంస్థ నుంచి సరైన సమాచారం లేకపోవడం, మేనేజర్ దురుసుగా ప్రవర్తించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “డబ్బులు చెల్లించినా బంగారం ఇవ్వడంలేదు,” అంటూ వారు వాపోతున్నారు. చాలా నెలలుగా ఇలాంటి సమస్యలతో కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు.

రుణ చెల్లింపులు చేసినా బంగారం లేదు

తాము తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించినా, బంగారం ఇవ్వకపోవడం బాధితులను ఆందోళనలోకి నెట్టింది. మరికొందరు తమ బంగారం అసలు ఉందో లేదో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ముత్తూట్ ఫైనాన్స్ స్పందించాల్సిందే!

ఈ ఆరోపణలపై ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ వెంటనే స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయాలు కామెంట్‌లో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి

ఈనాడు, ఆంధ్రజ్యోతిపై వైఎస్‌ జగన్‌ పరువునష్టం కేసు

ఇంట్లో అద్దెకు వచ్చి వృద్ధ జంటను హత్య చేసిన కిరాతకులు

వీడియో

Leave a Comment