మూకుమ్మడిగా సాక్షి జర్నలిస్టులపై కర్రలతో దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు | Shocking Attack on Sakshi Journalists by TDP Activists

WhatsApp Group Join Now

కడప జిల్లాలో సాక్షి జర్నలిస్టులపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సుమారు 50 మంది కలిసి సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్ రాజారెడ్డి, కెమెరామన్ రాములపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో జర్నలిస్టులకు గాయాలు అవ్వడంతో పాటు వారి చొక్కాలను చింపేసి దాడి చేయడం ఉద్రిక్తతలకు కారణమైంది.

ఎన్నికల ప్రక్రియలో వివాదాలు

కడప జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సానుభూతిపరులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి, జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు రెచ్చిపోతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

“నో డ్యూ సర్టిఫికెట్” వివాదం

నామినేషన్ ప్రక్రియలో భాగంగా నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుందని, వీటిని వైఎసీపీ కార్యకర్తలకు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. సాక్షి టీవీ ఈ విషయంపై కథనాన్ని ప్రసారం చేయగా, దానికి ప్రతిగా సాక్షి జర్నలిస్టులపై దాడి జరిగింది.

ఎంపీ అవినాష్ రెడ్డి స్పందన

ఈ ఘటనపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “పదే పదే కలెక్టర్, ఎస్పీకి విజ్ఞప్తి చేసినా చర్యలు తీసుకోవడం లేదు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయి,” అని ఆయన వ్యాఖ్యానించారు. నో డ్యూ సర్టిఫికెట్లు గ్రామ సచివాలయాల్లోనే అందేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు.

జర్నలిస్టుల నిరసన

దాడిలో గాయపడిన సాక్షి జర్నలిస్టు శ్రీనివాస్ మాట్లాడుతూ, “మమ్మల్ని హత్య చేయడానికే ఈ దాడి చేశారు. కర్రలు, రాళ్లతో పాటు కెమెరా స్టాండ్లను కూడా ఉపయోగించారు,” అని చెప్పారు. దాడి చేసిన టిడిపి కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జర్నలిస్ట్ సంఘాల స్పందన

జర్నలిస్టుల సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. జర్నలిస్టులపై ఇలాంటి దాడులు స్వేచ్ఛా భావాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటూ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి.

ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకోండి. అలాగే, మీ స్నేహితులకు ఈ కథనాన్ని షేర్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఏపీలో ఇకనుండి ట్రాఫిక్ చలానా కట్టకపోతే కరెంటు నీళ్లు కట్ ఆ?

6 లక్షల పించన్లు రద్దు చేయనున్న కూటమి ప్రభుత్వం – ఎందుకో తెలుసా?

వీడియో

Leave a Comment