ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై కార్మికుల‌కు అస్వ‌స్థ‌త‌ | Gas Leak in Factory Causes Workers to Fall ill

WhatsApp Group Join Now

అనంతపురం నవంబర్ 1 (తాజావార్త): అనంతపురం జిల్లా కొత్త‌ప‌ల్లి గ్రామంలోని సప్తగిరి క‌ర్పూరం ఫ్యాక్టరీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని రియాక్టర్ నుంచి లీకైన విషవాయువు పీల్చి ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో యాజమాన్యం వారికి తక్షణమే చికిత్స అందిస్తోంది.

ఆసుపత్రిలో రహస్యంగా చికిత్స

లీకేజీ ఘటన తరువాత, కార్మికులను రహస్యంగా అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం, సాంఘిక సమస్యలు తలెత్తకుండా ఆసుపత్రి గేట్ల వద్ద మీడియాకు కూడా ప్రవేశం నిరాకరించింది.

కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వని యాజమాన్యం

అస్వస్థతకు గురైన కార్మికుల కుటుంబ సభ్యులకు ఈ సమాచారం కూడా ఇవ్వడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది బాధిత కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

మద్యం మత్తులో టీడీపీ నేత వీరంగం

ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని పెంచుతున్న చంద్రబాబు

వీడియో

1 thought on “ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై కార్మికుల‌కు అస్వ‌స్థ‌త‌ | Gas Leak in Factory Causes Workers to Fall ill”

Leave a Comment