తెలంగాణ రాజకీయ వేదికపై మరొకసారి విమర్శల జోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి తనపై లక్షల తప్పుడు కేసులు పెట్టించినా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడం ఆపనన్నారు.
తీవ్ర ఆరోపణలు
హరీష్ రావు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై విమర్శిస్తూ, “అన్యాయాలను ప్రశ్నిస్తే సహించలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని” ఆరోపించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మరో తప్పుడు కేసు పెట్టించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి తప్పు చేసి మరింతగా ప్రజలను దబాయించడం మాత్రమే చేతనని విమర్శించారు.
ప్రజా తీర్పు తప్పదంటూ హెచ్చరిక
హరీష్ రావు రేవంత్ రెడ్డికి కఠిన హెచ్చరిక చేస్తూ, “ప్రజా కోర్టులో తగిన శిక్ష పడే వరకు ప్రశ్నించడం ఆపను,” అని అన్నారు. ప్రజలు తప్పు చేసే నాయకులకు తగిన తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
హరీష్ రావు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మేరకు వ్యతిరేకత పెరుగుతుందో చూడాలి.
మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. ఈ వార్తను ఇతరులకు షేర్ చెయ్యండి.
ఇవి కూడా చదవండి
కులాంతర వివాహం చేసుకున్నందుకు అక్కను చంపిన తమ్ముడు
ఎన్టీఆర్ పేరుతో పేదలకు ఉచిత భోజనం అందిచబోతున్న అభిమానులు
వీడియో
మిస్టర్ @revanth_anumula
అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు.
నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం,…
— Harish Rao Thanneeru (@BRSHarish) December 3, 2024