తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పాలనతో ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తూ, తెలంగాణలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాబాసాహెబ్ రాజ్యాంగ సూత్రాలను కాదని అధికార ప్రదర్శనకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
మూసీ ప్రాజెక్ట్ పై హైకోర్టు అభిప్రాయం – కాంగ్రెస్ తీరుకు ఆందోళన
హైకోర్టు మూసీ నదీతీరం మరియు హైడ్రా అంశాలపై వెలువరించిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని హరీష్ రావు అన్నారు.
రేవంత్ రెడ్డి బుల్డోజర్ వాడకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చడానికి దారితీస్తోందని ఆరోపించారు.
బుల్డోజర్ పాలన – పేదలపై అన్యాయం
హరీష్ రావు బుల్డోజర్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమానుష చర్యగా అభివర్ణిస్తూ, ఈ విధానం కేవలం బీజేపీ మాదిరిగా యూపీ, ఢిల్లీ, గుజరాత్లో పేదలను లక్ష్యంగా చేసుకోవడమేనని అన్నారు. రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో నడుస్తున్నారని వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు తీర్పును పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా, సరైన సర్వేలు చేయకుండా ఇళ్లను కూల్చడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను కాదని ప్రజల హక్కులను తొక్కుతున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీకి విజ్ఞప్తి
రాజ్యాంగంలో ఉన్న న్యాయ సూత్రాలను బట్టి, చట్టబద్ధమైన పాలన అందించేలా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహా ఇవ్వమని, ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ హైడ్రా విషయమై మాట్లాడవలసినదిగా హరీష్ రావు గారు రాహుల్ గాంధీ కి చెప్పారు.
ఇవి కూడా చదవండి
మూసీ నది హైడ్రా బాధితులకు అండగా నిలిచిన BRS నాయకులు
హోంగార్డు గోపాల్ మరణంపై హైడ్రా వ్యవహారంపై హరీష్రావు ఆగ్రహం
వీడియో
Shri @RahulGandhi ji,
It is with a heavy heart that I write this letter, not merely in my capacity as a senior leader of the @BRSparty, but more importantly as a concerned citizen of this great nation. I wish to bring to your attention that the Congress government in Telangana… pic.twitter.com/zQV6rMmJrt
— Harish Rao Thanneeru (@BRSHarish) September 30, 2024
3 thoughts on “హైడ్రా పై రేవంత్ తో మాట్లాడమని రాహుల్ కు హరీష్ రావు విజ్ఞప్తి | Harish Rao Urges Rahul Gandhi to Address Revanth Reddy on Hydra Issue”