కర్ణాటక రాష్ట్రంలోని కలబురగిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో, 26 ఏళ్ల మొహమ్మద్ నదీమ్ అనే యువకుడు తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ చేయకపోవడంతో, ఆగ్రహంతో షోరూం మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు.

20 రోజుల క్రితం ఓలా స్కూటర్ను కొనుగోలు చేసిన నదీమ్, స్కూటర్లో సమస్యలు రావడంతో రిపేర్ కోసం పలు సార్లు షోరూం సిబ్బందిని సంప్రదించాడు.
అయితే, షోరూం సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించడంతో నదీమ్ ఆగ్రహానికి గురై, పెట్రోల్ తీసుకువచ్చి షోరూం వద్ద నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో దాదాపు 6 స్కూటర్లు, కంప్యూటర్లు, మరియు షోరూం మొత్తం పూర్తిగా తగలబడింది, లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.

కలబురగి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నదీమ్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పోలీసు విచారణ కొనసాగుతోంది. షోరూం సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.
వీడియో
A 26-year-old customer identified as Mohammad Nadeem set fire to an #Ola Electric showroom in #Kalaburagi, Karnataka, after repeated delays in repairing his electric scooter.
Fire destroys six vehicles, computer systems. The entire shop has been destroyed in the fire.#Ola… pic.twitter.com/ofjJdhz8DH
— Madhuri Adnal (@madhuriadnal) September 11, 2024
కర్ణాటకలోని ఓలా ఎలక్ట్రిక్ షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టడంపై స్పందించిన ఓలా
ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని గుర్తించి సంబంధిత పోలీసు స్టేషన్లో వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.. అతడిని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యలను తీవ్రంగా… https://t.co/psZ803j3hL pic.twitter.com/xj1tVOwb2f
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2024