షిప్ ని సీజ్ చెయ్యడం కుదరదు అన్న కస్టమ్స్ అధికారులు | Pavan Kalyan Seize the ship Controversary

WhatsApp Group Join Now

కాకినాడ పోర్టు సమీపంలో అక్రమ రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 650 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం వన్ కళ్యాణ్ వెంటనే స్పందించి, అధికారులను విమర్శిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అధికారులపై ఆగ్రహం

పవన్ కళ్యాణ్ ఘటన స్థలానికి చేరుకున్న వెంటనే లోకల్ ఎమ్మెల్యే కొండబాబును పరోక్షంగా హెచ్చరించారు. “ఇలా స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? కంటైనర్లలో ఏముందో చూసే బాధ్యత ఎవరిది?” అంటూ అధికారులపై ఘాటుగా స్పందించారు.

షిప్ సీజ్ పై చర్చ

పవన్ కళ్యాణ్ “స్టెల్లా ఎల్ పనామా” అనే షిప్‌ను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే, కస్టమ్స్ అధికారులు ఇది సాధ్యం కాదని తెలిపారు. రేషన్ బియ్యం నిషేధిత వస్తువుల జాబితాలో లేకపోవడంతో షిప్ సీజ్ చేయడానికి కోర్టు అనుమతి అవసరం అని స్పష్టం చేశారు.

న్యాయపరమైన అవరోధాలు

“స్మగ్లింగ్ కు పాల్పడుతున్న షిప్ సీజ్ చేయాలంటే కఠిన నిబంధనలు ఉన్నాయి,” అని కస్టమ్స్ అధికారులు తెలిపారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో చర్చనీయాంశం అయ్యాయి.

ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి

ఇంట్లో అద్దెకు వచ్చి వృద్ధ జంటను హత్య చేసిన కిరాతకులు

ఈనాడు, ఆంధ్రజ్యోతిపై వైఎస్‌ జగన్‌ పరువునష్టం కేసు

వీడియో