సజ్జల భార్గవ్ డ్రైవర్ ను చిత్రహింసలు పెట్టిన పోలీసులు | Police Tortured Sajjala Bhargav Driver

WhatsApp Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సజ్జల భార్గవ్ కేసు విషయంలో భార్గవ్ కార్ డ్రైవర్ అయిన యామర్తి సుబ్బారావుపై పోలీసుల దురుసు ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారి తీసింది.

సజ్జల భార్గవ్ కేసు నేపథ్యం

సజ్జల భార్గవ్ గతంలో వైస్సార్సీపీ సోషల్ మీడియా హెడ్‌గా పనిచేశారు. ప్రభుత్వ మార్పు తర్వాత, ఆయనపై అనేక ఫాల్స్ కేసులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు, సుప్రీం కోర్టులు సజ్జల భార్గవ్‌కు అరెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చినప్పటికీ, పోలీసులు ఆయన సమాచారాన్ని సేకరించేందుకు డ్రైవర్ సుబ్బారావును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

పోలీసుల దారుణ ప్రవర్తన

సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడలో అతనిని అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ అపార్ట్మెంట్‌లోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రెండు గంటలపాటు హింసించి తిరిగి వదిలేశారు. ఈ ఘటనలో డ్రైవర్‌ సుబ్బారావు తీవ్ర గాయాలపాలయ్యాడు.

తగిన చర్యలు తీసుకోవాలి

సంబంధిత అధికారులు దీనిపై విచారణ చేపట్టాలని, లేకపోతే న్యాయపరమైన పోరాటం చేస్తామని బాధిత కుటుంబం పేర్కొంది. “పోలీసుల దురాగతం చట్టవిరుద్ధం,” అని ప్రతిపక్ష నాయకులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

ఇలాంటి ఘటనలు ఎంతవరకు న్యాయం? మీ అభిప్రాయాలను కామెంట్‌లో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి


రైతులు, విద్యార్థుల మేలు కోసం రంగంలోకి దిగిన జగన్ – రాష్ట్రమంతా నిరసనలు

రా ఎన్టీఆర్ పేరుతో పేదలకు ఉచిత భోజనం అందిచబోతున్న అభిమానులు

వీడియో

Leave a Comment