తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకుని “హైడ్రా” పేరుతో కొనసాగుతున్న కూల్చివేతలపై తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఇటీవల, హైడ్రా బృందం మహబూబ్నగర్లోని క్రిస్టియన్ పల్లి ఆదర్శ్ నగర్ లో కూల్చివేతలను నిర్వహించి పేద నివాసితుల ఇళ్లను కూల్చివేసింది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తెల్లవారుజామున ఈ చర్య జరగడంతో నివాసితులు తమ వస్తువులను తీసుకొనే అవకాశం లేకుండా పోయింది. దాదాపు 75 గృహాలు కూల్చివేయబడ్డాయి, వీటిలో 25 వికలాంగులకు చెందినవి, ఈ బలహీన కుటుంబాలు నాశనమై నిరాశ్రయులైనాయి.
గత ప్రభుత్వం నుంచి భూమి పట్టాలు పొందిన తర్వాత చట్టబద్ధంగా ఈ ఇళ్లను నిర్మించుకున్నామని బాధిత నివాసితులు పేర్కొంటున్నారు. ఈ ఇళ్లను నిర్మించేందుకు తాము కష్టపడి పైసా పైసా ఆదా చేశామని, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారని వారు తమ వేదనను వ్యక్తం చేశారు.

కేటీఆర్ రియాక్షన్
ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం మరియు అన్యాయం.
మీరు తెల్లవారుజామున ఎటువంటి నోటీసులు లేకుండా ఇలా పేదల ఇళ్లు కూల్చడం న్యాయమా? ఇది ఆధునిక నాగరితకు విఘాతం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణను మరొక బుల్డోజర్ రాజ్యం గా మార్చొద్దు అని అన్నారు.
వీడియో
— N@V€€N (@NaveenTs24) August 30, 2024
Dear Kharge Ji,
As you said, demolishing someone’s home and rendering their family homeless is both inhumane and unjust
This is exactly what is happening in Telangana with utter contempt for law & judiciary. Below is a video of Mahbubnagar town where 75 houses of poor have been… https://t.co/HlneWWBVlj pic.twitter.com/8qJJeeDQ45
— KTR (@KTRBRS) August 30, 2024